టెన్త్ మ్యాథ్స్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ లీక్.. ఆ ఎస్సై ఏం చేశాడంటే.. - Telugu News - Mic tv
mictv telugu

టెన్త్ మ్యాథ్స్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ లీక్.. ఆ ఎస్సై ఏం చేశాడంటే..

May 2, 2022

ఏపీలో నిత్యం ఏదో ఒకచోట పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అవ్వ‌డం, మాస్​ కాపీయింగ్​ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా క‌ర్నూల్ జిల్లా ఆలూరులో ప‌ద‌వ త‌ర‌గ‌తి లెక్క‌ల ప‌రీక్ష‌కు సంబంధించిన ప్ర‌శ్నాప‌త్రం సెల్ ఫోన్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. సోమ‌వారం ప‌రీక్ష జ‌రుగుతున్న స‌మ‌యంలో ఓ యువ‌కుడు ఎగ్జామ్ హాల్‌లో ప‌రీక్ష రాస్తున్న త‌న స్నేహితుల‌కు చిట్టీలు వేసేందుకు ప్ర‌య‌త్నించాడు. ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న సెంట‌ర్ వ‌ద్ద అనుమాన‌స్ప‌దంగా తిరుగుతుండ‌డం అక్కడే విధులు నిర్వ‌హిస్తున్న ఎస్సై కంట ప‌డింది. ఎస్సై ఆ యువ‌కుడిని ప‌ట్టుకొని గ‌ట్టిగా నిల‌దీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అత‌ని సెల్ ఫోన్ లో మ్యాథ్స్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ క‌నిపించ‌డంతో అవాక్కైన ఎస్సై వెంట‌నే ఈ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగి ఆలూరు స‌ర్కిల్ ఆఫీస్ లో విచార‌ణ చేపట్టారు. అస‌లు క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఎలా లీకైంది? దీని వెనుక ఎవ‌రెవరున్నారు కోణంలో ఎంక్వ‌యిరీ చేస్తున్నారు.

ఈ ఏడాది ఏపీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షా పత్రాలు లీక‌వ‌డం ఇదే తొలిసారి కాదు. కృష్ణాజిల్లా డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు మాస్ కాపీయింగ్ వెలుగుచూసింది. కొందరు ఉపాధ్యాయుల వద్ద ఇవాళ జరుగుతున్న పరీక్షల ప్రశ్నలకు సెల్ ఫోన్‌లో సమాధానాలను విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై డీఈవో విచారణ జరుపుతున్నారు. ఇక నంధ్యాల‌లోని నందికొట్కూరులో టెన్త్‌ ఇంగ్లీష్ పేపర్‌ లీక్ అయింది. ఈ వ్యవహారంలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్సీ శృతి వెల్లడించారు. అరెస్టైనవారిలో శ్రీనంవనది హైస్కూల్‌కు చెందిన ముగ్గురు టీచర్లు  ఉన్నారని ఆమె తెలిపారు.