Home > Corona Updates > తెలంగాణలో కొత్తగా 47 కరోనా కేసులు..

తెలంగాణలో కొత్తగా 47 కరోనా కేసులు..

47 New corona

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకి కేసుల సంఖ్యా పెరుగుతూ పోతుంది. నిన్న ఒక్కరోజే 41 కొత్త కేసులు నమోదు కాగా.. ఈరోజు మరో 47 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఐదుగురు వలస కూలీలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యా 1414కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 428 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి.

కరోనా నుంచి కోలుకుని ఈరోజు 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 952 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 34కి పెరిగింది. దేశంలో కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 78,003 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిలో 26,235 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,549 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు.

Updated : 14 May 2020 10:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top