ఈమధ్యకాలంలో విమానాల్లో ప్రయాణికులు చేసే వెర్రిచేష్టలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఎయిర్ ఇండియా పీ గేట్ కేసు తర్వాత ఇప్పుడు మరో షాకింగ్ కేసు తెరపైకి వచ్చింది. లండన్ నుంచి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో 37 ఏళ్ల వ్యక్తి విమానం టాయిలెట్లో పొగ తాగుతూ పట్టుబడ్డాడు. ఎయిర్ ఇండియా సిబ్బంది ఈ విషయం గురించి సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫ్లైట్లో సిగరేట్ కాల్చేందుకు పర్మిషన్ ఉండదు. ప్రయాణీకుడు బాత్రూంలోకి వెళ్లి సిగరేట్ తాగడంతో ఫ్లైట్ అలారం మోగింది.
A case has been registered against a 37-year-old man identified as Ramakant, a US citizen, in Sahar Police Station for allegedly smoking in the bathroom and misbehaving with other passengers on Air India London-Mumbai flight on March 11: Mumbai Police
— ANI (@ANI) March 12, 2023
దీంతో సిబ్బంది అంతాకూడా బాత్రూం వైపు పరుగులు తీశారు. ప్రయాణీకుడి చేతిలో నుంచి సిగరేట్ తీసేశారు. ప్రయాణీకుడు రమాకాంత్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించాడు. నానా రచ్చ చేశాడు. ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. సిబ్బందిపై బూతుల వర్షం కురిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని చేతులు, కాళ్లు కట్టేశారు సిబ్బంది.
As per flight crew, accused tried to open the door of the flight. He also said that he was carrying some medicine in his bag,but no such object found in his bag.Accused's samples sent for examination to confirm if he was in an inebriated condition or was mentally disturbed:… https://t.co/0EV2BhYTTO
— ANI (@ANI) March 12, 2023
అతని ప్రవర్తనతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది సహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అతను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పౌరుడు, అమెరికన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.