రాజస్థాన్లోని చురు జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది, రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో ఓ వింత శిశువు జన్మించింది. అయితే ఈ నవజాత శిశువు పుట్టిన 20 నిమిషాలకే మరణించింది. అయితే బిడ్డ తల్లి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన చురు జిల్లాలోని రతన్గఢ్లోని గంగారాం ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
రతన్గఢ్లో రాజల్దేసర్లోని 3వ వార్డులో నివాసం ఉంటున్న 19 ఏళ్ల గర్భిణి హజారీ సింగ్ కు పురిటినొప్పులు రావడంతో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు సోనోగ్రఫీ నిర్వహించిన వైద్యులు అందులో వింత శిశువు కనిపించినట్లు డాక్టర్ కైలాష్ సొంగరా తెలిపారు. ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత హజారీ సింగ్ కు నార్మల్ డెలివరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. ఈ రకమైన డెలివరీని కంజుక్టివల్ అనోమలీ అంటారు. అయితే 20 నిమిషాలకే బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ బిడ్డ ఇలా పుట్టడానికి క్రోమోజోమ్ల లోపం కావచ్చ అని వారు తెలిపారు. ఈ వింత పాపను చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి చాలా మంది జనం తరలివచ్చారు.
चूरू के रतनगढ़ में जन्मा अजीब बालक, चार हाथ, चार पांव और एक सिर, बना चर्चा का विषय#Rajasthan https://t.co/VRS85MkP2y
— Rajasthan Tak (@Rajasthan_Tak) March 6, 2023
2022 డిసెంబరులో ఇలాంటి వింత ఘటనే మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ జిల్లాలో ఓ పాప నాలుగు కాళ్లతో పుట్టింది. అయితే ఈ బిడ్డ పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.