నైజీరియాలోని లాగోస్లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం ప్రయాణికుల బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం, బస్సు ప్రభుత్వ ఉద్యోగులను పని కోసం తీసుకెళ్తుండగా బస్సును ఇంటర్సిటీ రైలు ఢీకొట్టింది.
More news and uncensored videos in our telegram channel
👉TELEGRAM: https://t.co/JDDUrdyqRt#BreakingNews : 🚄Again, the disaster associated with the train. 2 people were killed and several injured in a train-bus collision in #Lagos, #Nigeria 🇳🇬 #news #disaster #traincrash pic.twitter.com/XDhWJATi4R— DISASTERS IN THE WORLD (@WRLD_disasters) March 9, 2023
నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అధిపతి ఇబ్రహీం ఫారిన్లోయ్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు 84 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఫారిన్లాయ్ కు చెందిన బస్సు ప్రభుత్వ ఉద్యోగులను కార్యాలయానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లాగోస్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ కార్యదర్శి ఒలుఫెమి ఒకే ఒసానింటోలు తెలిపారు. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. బస్సు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.