Home > క్రైమ్ > ఆస్పత్రిలో ఉగ్రఘాతుకం.. పసిపిల్లలను వదల్లేదు

ఆస్పత్రిలో ఉగ్రఘాతుకం.. పసిపిల్లలను వదల్లేదు

Afghanistan Hospital

ముష్కరులు మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌లో రెచ్చిపోయారు. ఏకంగా ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పుల్లో 14 మంది మరణించారు. ఇందులో ఇద్దరు పసి కందులు కూడా ఉన్నారు. పశ్చిమ కాబూల్’లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. తాజాగా ఘటనతో ప్రభుత్వం అప్రత్తమైంది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు చర్యలు చేపట్టారు. భద్రత చర్యల్లో భాగంగా అదనపు బలగాలను మోహరించారు.

తుపాకులు ధరించిన ముగ్గురు ఉగ్రవాదులు ఓ ప్రసూతి ఆస్పత్రిలోకి చొరబడ్డారు. అక్కడికి వెళ్లిన వెంటనే తూటాల వర్షం కురిపించారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చివేశారు. పసి బిడ్డలు అనే కణికరం కూడా లేకుండా బుల్లెట్లు దింపారు. ఈ ఘటనలో ఇద్దరు నర్సులు, 12 మంది బాలింతలు, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కళ్లు కూడా తెరవని చిన్నారులను నరరూప రాక్షశుల్లా ప్రాణాలు తీయడంపై పలువురు ఖండించారు.

Updated : 12 May 2020 8:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top