“అగ్నిపథ్ పథకంపై జరుగుతోన్న ఈ హింసాత్మక ఆందోళనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలిపే కచ్చితమైన సూచికలు. అప్పుడు అన్నదాతల జీవితాలతో ఆడుకున్నారు. ఇప్పుడు దేశ జవాన్లతో ఆడుకుంటున్నారు. మొన్న ‘ఒకే ర్యాంక్ – ఒకే పింఛను’ విధానం నేడు ‘ర్యాంకు లేదు – పింఛను లేదు’ అనే ప్రతిపాదన” అని కేటీఆర్ ట్విటర్లో రాసుకొచ్చారు.
The violent protests against #AgniveerScheme is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country
Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़
From One Rank – One Pension to proposed No Rank – No Pension!
— KTR (@KTRTRS) June 17, 2022
మరోపక్క అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఆందోళనలు నేడు హైదరాబాద్కు విస్తరించాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు ఒకరు మృతికి కారణమవ్వగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ, కేటీఆర్ కాసేపటి క్రితమే ట్విటర్ వేదికగా స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నిరసన జ్వాలలు దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయని దుయ్యబట్టారు.