ఎయిర్టెల్ ఆఫర్.. 5 లక్షల ఉచిత బీమా
తన వినియోగదారుల కోసం ఎయిర్టెల్ ఓ సరికొత్త ప్లాన్ను తీసుకువచ్చింది. ‘భరోసా సేవింగ్స్ అకౌంట్’ పేరుతో కొత్త సేవను మంగళవారం ప్రారంభించింది. ఇది అన్బ్యాంక్ కస్టమర్ల ప్రత్యేకమైన అవసరాలను తీర్చనుందని.. అలాగే ఇది అండర్ బ్యాంక్ అని కంపెనీ ప్రకటించింది. కేవలం రూ.500ల నెలవారీ బాలెన్స్తో ఈ ఖాతాను నిర్వహించవచ్చని తెలిపింది. అంతేకాకుండా దాంతోనే 5లక్షల రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమాను ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఖాతా ద్వారా సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, నెలకు ఒక లావాదేవీ ఉచితంగా అందిస్తోంది. భరోసా సేవింగ్స్ ఖాతాదారులు భారతదేశం అంతటా 6,50,000 ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం అవులెట్లలో నగదు ఉపసంహరించుకోవచ్చని.. బ్యాలెన్స్ తనిఖీ, మినీ స్టేట్మెంట్ను కూడా తీసుకోవచ్చని తెలిపింది.
అంతేకాకుండా ఈ ఖాతా ద్వారా ప్రభుత్వ రాయితీలు పొందొచ్చు. నగదు డిపాజిట్లు చేసే వినియోగదారులు క్యాష్బ్యాక్ సదుపాయాన్ని కూడా పొందవచ్చని పేర్కొంది. ఈ విషయమై ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఎండీ అనుబ్రాతా బిశ్వాస్ మాట్లాడుతూ.. ‘భరోసా సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వినూత్న ఖాతాతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగం, లావాదేవీల అధికారిక బ్యాంకింగ్ విధానాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది ఆర్థికంగా వెనుకబడినవారి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన వినూత్నమైన, విభిన్నమైన పథకం’ అని తెలిపారు.