ఒకప్పటి బుల్లితెర యాంకర్ ఇప్పటి ట్రెండింగ్ యూట్యూబర్ లాస్య ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుసు. రీసెంట్గానే బుల్లితెర సెలబ్రిటీలతో కలిసి సంబరంగా సీమంతాన్ని జరుపుకుంది లాస్య. తాజాగా లాస్య ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. రంగుల పండుగ రోజు బిడ్డ పుట్టడంతో ఇంటికి కొత్త రంగు వచ్చిందంటూ కుటుంబసభ్యులు సంతోషంలో మునిగిపోయారు. చేతులకు రంగులు పూసుకుని తమకు బాబు పుట్టాడన్న విషయాన్ని లాస్య భర్త మంజునాథ్ ఓ వీడియో ద్వారా తెలిపారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కపుల్కు కంగ్రాట్స్ చేబుతున్నారు.
చీమ ఏనుగు జోక్స్తో లాస్య బుల్లితెరపైన తనకంటూ క్రేజ్ను సంపాదించుకుంది. టీవీలో పలు షోలకు యాంకర్గాను వ్యవహరించింది లాస్య. తాను ప్రేమించిన మంజునాథ్ను లవ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యింది లాస్య. పెళ్లి తరువాత కెరీర్కు బ్రేక్ చెప్పినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. యూట్యూబ్, ట్విటర్లలో వీడియోలను పోస్ట్ చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటుంది లాస్య. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తుంటుంది. తాజా తనకు బాబు పుట్టాడన్న విషయాన్ని ఇన్స్టా వేదికగా ఫ్యాన్స్తో పంచుకుంది.