Andhra Pradesh cm jagan mohan reddy plane emergency landing in Vijayawada gannavaram airport
mictv telugu

బ్రేకింగ్.. జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్

January 30, 2023

Andhra Pradesh cm jagan mohan reddy plane emergency landing in Vijayawada gannavaram airport

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు తాత్కాలిక ఆటంకం కలిగింది. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా దించేశారు. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడ్డంతో గన్నవరం ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సోమవారం సాయంత్రం 5.03 నిమిషాలకు టేకాఫ్ కాగా సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు. 5.20 నిమిషాలకు విమానాన్ని మళ్లీ వెనక్కి తిప్పి గన్నవరం ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ చేశారు. సీఎం తర్వాత తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఆయన ఢిల్లీ వెళ్తారో లేదో తెలియడం లేదు. మంగళవారం ఢిల్లీలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ తో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.