కెనడాలో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. తాజాగా మరోసారి హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. మిస్సిసాగాలోని రామమందిరంపై విద్వేష దాడి జరిగింది. ఈ దేవాలయం ప్రాంగణంలో భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు రాశారు. ఈ దారుణ ఘటనను టొరంటోని ఇండియన్ కాన్సలేట్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని భారతీయుల మనోభావాలను ఈ సంఘటన తీవ్రంగా గాయపరించిందని..ఈ దేవాలయం భారత వారసత్వ ఔన్నత్యానికి ప్రతీక అని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై సత్వర చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం కెనడా అధికారులను అభ్యర్థించింది.
Canada: Consulate General of India condemns defacing of Ram Mandir in Mississauga
Read @ANI Story | https://t.co/FcRti0ofnx#Canada #RamMandir #India #Mississauga pic.twitter.com/Nfkfg8CpX0
— ANI Digital (@ani_digital) February 14, 2023
హిందూ దేవాలయాలపై దాడి ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు కూడా కెనడాలోని బ్రాంప్టన్ లోని ఓ దేవాలయంపై దాడులు జరిగాయి. ఈ దేవాలయంలో హిందూ వ్యతిరేక నినాదాలు రాశారు. దీంతో భారతీయులు ఆగ్రహానికి గురయ్యారు. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ గౌరీ శంకర్ ఆలయంలో జరిగిన విధ్వంసాన్ని ఖండించారు. ఈ చర్య కెనడాలోని భారతీయులు మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంది.