Home > విద్య & ఉద్యోగాలు > ఏపీ: నిరుద్యోగులకు శుభవార్త..282 పోస్టులకు నోటిఫికేషన్

ఏపీ: నిరుద్యోగులకు శుభవార్త..282 పోస్టులకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్తను చెప్పింది. మోడల్ స్కూళ్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన 282 టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారులు శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. విడుదల చేసిన మొత్తం పోస్టుల్లో వీటిలో 71 బ్రెయిన్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులున్నాయని, ఈ ఉద్యోగాలను అభ్యర్థుల అర్హతలు, ఇతర ప్రాధమ్యాలను పరిగణనలోకి తీసుకొని, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికచేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.

జోన్ల వారీగా చూస్తే…టీజీటీ పోస్టులు జోన్ 1లో 17, జోన్ 3లో 23, జోన్ 4లో 31 ఉండగా, పీజీటీ పోస్టులు జోన్ 1లో 33, జోన్ 2లో 4, జోన్ 8లో 50, జోన్ 4లో 124 ఉన్నాయి. అభ్యర్థులు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ “హెచీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్"ను సందర్శించాలని తెలిపారు.

"అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్డులకు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లు.
పీజీటీ పోస్టులకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పీజీటీ కామర్స్ పోస్టులకు ఎం.కామ్ అప్లయిడ్ బిజినెస్ ఎకనమిక్స్ చేసిన వారు అర్హులు కారు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులు లేదా యూజీసీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో డిగ్రీ కోర్సు పూర్తి చేసి 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు లలో బీఈడీ తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీ ర్ణులై ఉండాలి."

Updated : 6 Aug 2022 1:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top