ఏపీ: విద్యార్థుల్లారా.. నేడే టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు
Editor | 2 Aug 2022 11:03 PM GMT
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తాజగా జరిగిన పదోవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు మరో తాజా విషయాన్ని వెల్లడించారు. నేడు ఉదయం 11 గంటలకు టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. కావున అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్ధిని, విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఫలితాలను చెక్ చేసుకోవాలని కోరారు.
"బుధవారం రోజున టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. విద్యార్థినీ, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/, http://www.manabadi.co.in/లో ఫలితాలను చెక్ చేసుకోవాలి"అని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు.
Updated : 2 Aug 2022 11:03 PM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire