తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో గడువు ముగియనుంది. రాష్ట్రంలో 783 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ డిసెంబర్ 29 న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 18 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భారీ స్థాయిలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన నాటికి 5లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి 18 నుంచి మొదలైన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇంకా అప్లై చేయనివారు www.tspsc.gov.in వెబ్సైట్ని సందర్శించవచ్చు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్లో ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి:
2022 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 44 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు 21 నుంచి 30 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
రూ.38,890/- నుంచి 1,18,230/- వరకు
ఎంపిక విధానం:
రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు చొప్పున 600 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది.