టాటా గ్రూప్ సంస్థ తమ ఉద్యోగులకు గట్టిషాక్ ఇచ్చింది. ప్రభుత్వ సంబంధిత హౌజింగ్ కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులు వెంటనే తమ తమ కాలనీలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యాపార రంగంలో మంచిపేరుకు మారుపేరుగా కొనసాగుతున్న టాటా గ్రూప్.. గత ఏడాది ఎయిర్ ఇండియాను చేజేక్కించుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే పనిచేసే చోట ఉద్యోగులు ధూమపానం, మద్యపానం చేయకూడదని నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఉద్యోగుల కోసం మరో కీలక ప్రకటన చేసింది.
”ప్రభుత్వ సంబంధిత హౌజింగ్ కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులు జులై 26వ తేదీలోపు ఖాళీ చేయాలి. ఖాళీ చేయని పక్షంలో ఉద్యోగులపై పెనాల్టీ, డ్యామేజ్ ఛార్జీలతోపాటు రిటైర్మెంట్, ఇతర ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతారు” అని ఎయిర్ ఇండియా హెచ్చరించింది.
మరోపక్క ఎయిర్ ఇండియాకు ఢిల్లీ, ముంబైలో హౌజింగ్ కాలనీలు ఉన్నాయి. 1,800 మందికి పైగా ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. వీళ్లంతా కేంద్రం చర్యను వ్యతిరేకిస్తూ, కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు. ఎయిర్ ఇండియా అస్సెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక, ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ అల్టర్నేటివ్ మెకానిజంను కేంద్ర మంత్రుల బృందం పర్యవేక్షిస్తుంది. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంతత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ వ్యవహారాలను చూస్తున్నారు. ఈ క్రమంలో టాటా గ్రూప్ ఉద్యోగులను ఖాళీ చేయాలని మరోసారి ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.