కల్వకుంట్ల కుటుంబానికి దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేపు యాదాద్రిలో కేసీఆర్ సహా ముగ్గురు ముఖ్యమంత్రుల పర్యటన నేపథ్యంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో రేపు నిర్వహించే బీఆర్ఎస్ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రానికే వీరంతా హైదరాబాద్ కు చేరుకోనున్నారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో అల్పాహారం చేశాక.. రెండు స్పెషల్ హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు.
Temples have become business centers for Kalvakuntla family. Yadadri development is an investment & public contributions to holy Hundi are returns says #TwitterTillu
Is KCR taking other states CMs to showcase Hindu temple as investment opportunity ahead of BRS Khammam meeting ?
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 17, 2023
ఈ నేపథ్యంలోనే బండి సంజయ్.. ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు. “కల్వకుంట్ల కుటుంబానికి ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఇతర రాష్ట్రాల సీఎంలను యాదాద్రికి ఎందుకు తీసుకెళ్తున్నారు. యాదాద్రిని పెట్టుబడి అవకాశంగా చూపేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు” అని కామెంట్ చేశారు. యాదాద్రి అభివృద్ధి అనేది పెట్టుబడిగా, పవిత్ర హుండీకి ప్రజల విరాళాలు రాబడి అని ట్విట్టర్ టిల్లు చెప్పారంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.