రోజ్ వాటర్ మన సౌందర్యాన్ని కాపాడటానికి ఎంతగానో ఉయోగపడుతుంది. ఎన్నో సౌందర్య ఉత్పత్తులలోనూ రోజ్ వాటర్ వాడతారు. రోజ్ వాటర్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి.
డార్క్ సర్కిల్స్:
ఈ రోజుల్లో ఫోన్లు, ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడటం వల్ల.. చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి.. రోజ్ వాటర్ సహాయపడుతుంది. కొద్దిగా రోజ్వాటర్ని తీసుకొని అందులో కాటన్ను ముంచి కళ్ళ కింద రాయాలి. ఇలా కనీసం రెండురోజులకోసారి చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తే కళ్ళు బరువెక్కడం, నొప్పి, మంట వంటి సమస్యలు దూరం అవుతాయి.
రోజ్ వాటర్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్లా పనిచేసి సూర్యుడి నుంచి వచ్చే.. యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎండలో వెళ్ళేముందు ముఖంపై రోజ్ వాటర్ అప్లై చేసుకుంటే మంచిది. రోజూ ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేస్తే.. చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖ చర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకుని.. చర్మం తాజాగా కనిపిస్తుంది.
క్లెన్సర్:
రోజ్ వాటర్ క్లెన్సర్గా పని చేస్తుంది. రోజ్వాటర్ మన ముఖంపై ఉన్న జిడ్డుని, పేరుకుపోయిన మురికిని తీసేసి చర్మాన్ని ఫ్రెష్గా ఉంచుతాయి. ఇందులో ఉన్న సహజసిద్ధమైన నూనెలు మన చర్మంలో ఉన్న తేమను పోనీయకుండా కాపాడతాయి. స్నానం చేసే నీటిలో కాస్తంత రోజ్వాటర్ వేస్తే చర్మం మెరుస్తుంది.
యాంటీ ఏజింగ్:
రోజుకి ఒకసారైనా గులాబీ నీళ్ళల్లో ముంచిన దూదితో ముఖాన్ని తుడిస్తే మంచిది. ఇది యాస్ట్రింజెంట్గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలూ కూడా ఇందులో ఉండటం వల్ల ముడతలూ, వలయాలూ అదుపులో ఉంటాయి. పావు కప్పు గులాబీ నీళ్ళల్లో కొద్దిగా తేనె కలిపి.. మునివేళ్ళతో ముఖానికి రాసి మర్దన చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మెరిసిపోతుంది.
ఇవి కూడా చదవండి :
సోనీ కొత్త ఫ్లాగ్ షిప్ వాక్ మాన్ విడుదల!
మూడు కోట్ల నగలు, 30 కిలోల బరువుండే చీర