మెడికో ప్రీతి మరణంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రీతి మరణం బాధాకరమన్న సంజయ్…ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రీతి కుటుంబం ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రీతి మరణించడం తన మనస్సును కలచివేసిందన్నారు. ప్రీతి ముమ్మాటికీ హత్యే అన్నారు. ప్రీతి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం పట్టించుకుంటే ఈ దారుణం జరిగేది కాదన్నారు. ముమ్మాటీకి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రీతి మరణించిందన్నారు. కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రీతి ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించేంత వరకు తాము పోరాడతామన్నారు.
డా.ప్రీతి మరణం అత్యంత బాధాకరం.తన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
ఎంతో భవిష్యత్ ఉన్న తను చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేసింది.ఇది ముమ్మాటికీ హత్యే.ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే ఈ దారుణం జరిగింది— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 26, 2023
ఈ ఘటనపై ఇప్పటిదాకా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? గిరిజన విద్యార్థిని కాబట్టి,ఏమైనా ఫరవాలేదనే స్పందించలేదా? మీరిచ్చే 10లక్షల రూపాయల సాయం,ఆ తల్లిదండ్రుల గుండె కోత చల్లార్చుతుందా?
కేసీఆర్ పాలనలో బిఆర్ఎస్,ఎంఐఎం మద్దతుంటే క్రిమినల్స్ ఏం చేసినా చెల్లుతుందని ప్రీతి ఘటన నిరూపిస్తోంది— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 26, 2023
కేసీఆర్ కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఈ ఘటన అద్దం పడుతోంది. ప్రీతి ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తన మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించే వరకు పోరాడతాం. భవిష్యత్తులో ప్రీతి లాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 26, 2023
భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకు రాకుండా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థిని కాబట్ట ఏమైనా పర్వలేదని స్పందించడం లేదా అంటూ మండిపడ్డారు. మీరు ఇచ్చే రూ. 10లక్షల సాయం ఆ తల్లిదండ్రుల గుండె కోత చల్చార్చుతుందా అంటూ ఫైర్ అయ్యారు.