Home > Featured > బొలెరో వాహనం బోల్తా.. ఆర్ఎస్ఐ మృతి

బొలెరో వాహనం బోల్తా.. ఆర్ఎస్ఐ మృతి

Bolero Incident at pembarti.. RSI Karnudu No more

కరోనా సంక్షోభంలో ఘోరం జరిగింది. నిత్యం ప్రజాసేవలో భాగమైన ఓ పోలీస్ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో బొలెరో పోలీస్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వరంగల్ పీటీసీ(పోలీస్ ట్రైనింగ్ కాలేజీ)కి చెందిన ఆర్ఎస్ఐ కర్ణుడు అక్కడికక్కడే మృతి చెందారు. డిపార్ట్‌మెంట్ వాహనంలో కర్ణుడు వరంగల్ నుండి హైదరాబాదు వెళ్తుండగా పెంబర్తి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 2 May 2020 10:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top