తిరుపతిలో విషాదం.. ఇంటిని కూల్చేస్తుండగా బాలుడి మృతి
Editor | 30 May 2020 1:46 AM GMT
చిత్తూరు జిల్లా తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటిని కూల్చుతుండగా.. శిథిలాలు మీదపడి ఓ 14 ఏళ్ల బాలుడు మరణించాడు. కోటకొమ్మాల వీధిలో శనివారం ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో బాలుడు తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
భవన నిర్మాణ పనుల్లో భాగంగా ఓ భవనాన్ని కూలీలు కూల్చి వేవేస్తున్నారు. ఆ సమయంలో అక్కడే భరత్ అనే బాలుడు అక్కడి నుంచి వెళ్తన్నాడు. ఆ సమయంలో పైనుంచి బలమైన పెళ్లలు వచ్చి తలపై పడ్డాయి. తీవ్ర గాయాలతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు గమనించి రూయా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భరత్ చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Updated : 30 May 2020 1:47 AM GMT
Tags: boy Building demolition house tirupati
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire