టీఎస్ఆర్టీసీ బస్పాస్ ధరలను భారీగా పెంచబోతోంది. మొన్ననే టిక్కెట్ల ధరలను పెంచగా, ఇప్పుడు పాసుల వంతు వచ్చింది. పెరుగుతున్న డీజిల్ ధరలు, నిర్వహణ కష్టాల నేపథ్యలో పెంపు తప్పదని అంటోంది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే విద్యార్థుల పాసులకు మినహాయింపునిచ్చింది. వీరికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెంచే అవకాశాలు ఉన్నాయి.
ధరలు ఎంత పెరుగుతున్నాయంటే..
బస్ పాస్ రకం పాత ధర కొత్త ధర
ఆర్డినరీ 950 1150
ఎక్స్ ప్రెస్ 1070 1300
డీలక్స్ 1185 1450
ఏసీ బస్సు 2500 3000
ఎన్జీవో ఆర్డినరీ 320 400
ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్ 450 550
ఎన్జీవో డీలక్స్ 575 700