బీహార్ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ లో రబ్రీదేవిని ప్రశ్నిస్తున్నారు. రబ్రీదేవి భర్త…లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో 2004 నుంచి 2009 మధ్య కాలంలో రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చేందుకు తక్కువ ధరకే భూమిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించిన లింకుతోనే రబ్రీదేవిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రబ్రీదేవి దగ్గర కేవలం వాంగ్మూలాన్ని మాత్రమే తీసుకుంటున్నామని సీబీఐ అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. తాము దాడులు, సోదాలు నిర్వహించడం లేదని తెలిపారు. రబ్రీదేవి అపాయింట్ మెంట్ తోనే ఆమె నివాసానికి వెళ్లినట్లు చెప్పారు.
पटना में राबड़ी देवी के आवास पर सीबीआई की टीम पहुंची है। रेलवे में नौकरी के बदले जमीन मामले में पूछताछ की जा रही है।#laluyadav #rabridevi #irctcjobscam #Bihar #irctc #jobscam pic.twitter.com/7pmKZc8yg2
— Aditi Choudhary (@AditiCh55268810) March 6, 2023
మార్చి 15న ఢిల్లీ కోర్టు మాజీ రైల్వే మంత్రి లాలూ యాదవ్, రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి, ఇతర నిందితులకు సమన్లు జారీ చేసి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. లాలూ ప్రసాద్తో పాటు రబ్రీ దేవితో పాటు మరో 14 మందిని సీబీఐ చార్జిషీట్లో నిందితులుగా చేర్చింది. ఈ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ పేరు కూడా ఉంది.
CBI visits Rabri Devi's residence in Patna, Bihar in connection with land-for-job case: CBI official to ANI https://t.co/Ob0UYWRpie pic.twitter.com/Hhf5pBH52k
— ANI (@ANI) March 6, 2023