ఇద్దరు తెలుగు కవులకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగు కవులు వారాల ఆనంద్, మధురాంతకం నరేంద్రకు ఈ అవార్డు దక్కింది. మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనో ధర్మపరాగం’ నవలకు అవార్డు వచ్చింది.
అనువాద రచయిత వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకానికి అవార్డు లభించింది. ప్రముఖ భావకవి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత గుల్జార్ రాసిన గ్రీన్ పోయెమ్స్ ని పవన్ కే శర్మ ఆంగ్లానువాదం తోడ్పాటులో కవితలను తెలుగులోకి వారాల ఆనంద్ అనువదించారు. ఇతను ద్విభాషా కవి కాగా, ఇందులో ఉన్న 58 కవితలు ప్రకృతికి సంబంధించినవే. మనిషి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ కవితల్లో చాలా సూటిగా చెప్పారు. ఈ అవార్డు కింద తామ్ర ఫలకంతో పాటు రూ. 50 వేల నగదును అందజేస్తారు. దీంతో పాటు పలు రాయితీలు ఉంటాయి. కాగా, ఈ కవితలకు మూల రచయిత అయిన గుల్జార్.. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషల్లో పుంఖానుపుంఖాలుగా కవితలు రాశారు.