ఆంధ్రప్రదేశ్ లున్న జర్నలిస్ట్ లందర్కి..శుభవార్త,జర్నలిస్ట్ లందరు సంబురంల మునిగితేలే ఖుషీ ఖబర్ జెప్పిండు చంద్రబాబు సారు,కర్నూలు జిల్లా నంద్యాలలో ఉపఎన్నికల సందర్బంగా పర్యటించిన చంద్రబాబు.. ఓ బహిరంగ మీటింగుల మీడియా సమక్షంల అటు పబ్లిక్ తో పాటు..జర్నలిస్టుల మిత్రులపై వరాల జల్లులు కురిపించారు,జర్నిలిస్టులందరికి మీడియా సమక్షంలో చెపుతున్నా అందర్కి త్రిబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తామని మీకు తెలియజేస్తున్నాను అని జర్నలిస్టుల నోట్లే శెక్కరి వోశినంత తియ్యటి కబురు జెప్పిండు.ఈవార్త ఇనంగనే అటు జర్నలిస్ట్ నాయకుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.జర్నలిస్టు సోదరులు ఇంకే… సారు గట్టిచ్చే త్రిబుల్ బెడ్ రూం ఇండ్లల్ల పాలు పొంగిచ్చికోని పాదం మోపనీకి తయారుగుండున్రి…ఆల్ ది బెస్ట్.