తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు టికెట్ల ధరల విషయంలో స్పల్ప మార్పులు చేస్తూ, టీఎస్ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు టికెట్ల చార్జీలను రౌండప్ చేసినట్లు పేర్కొంది. చిల్లర సమస్య లేకుండా ధరలు రౌండప్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ.10గా రౌండప్ చేసింది. రూ.13, రూ.14 ఉన్న టికెట్ ఛార్జీని రూ.15గా ఫైనల్ చేసింది. 80 కిలోమీటర్ల దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65గా ఆర్టీసీ నిర్ధారించింది.
అంతేకాకుండా టోల్ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సులో అయితే రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 అదనంగా ప్రయాణీకుల నుంచి వసూలు చేయనున్నట్లు తెలిపింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. కరోనా లాక్డౌన్, ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీ సజ్జనార్ తనదైన శైలిలో ముందకు వెళ్తున్నారు. ఓవైపు ఆఫర్లను, ఫ్యాకేజీలను ప్రకటిస్తూ.. ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. టీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు.