మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం భారీ క్రేజ్తో అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజు రిలీజ్ సందర్భంగా మెగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. సినిమాలోని చిరు వేషధారణతో అభిమానులు ఆకట్టుకుంటున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి పలువురు సినీ సెలబ్రెటీస్ మూవీని చూశారు.
డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, చిరంజీవి కూతుర్లు, మనవరాళ్లు, డైరెక్టర్ మెహర్ రమేష్ వాల్తేర్ వీరయ్య మొదటి షోను చూశారు. తెల్లవారుజామున నాలుగు గంటలకే సంధ్య థియేటర్ కు చేరుకున్న వీరందరూ.. అభిమానుల మధ్య మూవీని చూసి ఎంజాయ్ చేశారు. దీనికి తోడు థియేటర్ వద్ద మెగా అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బాణాసంచా పేలుస్తూ.. తమ అభిమాన హీరో చిరంజీవి మూవీని ఎంజాయ్ చేస్తూ… ఆనందం వ్యక్తం చేస్తున్నారు.