కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీకి పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణం అయింది. అనిల్ ఆంటోని ఆ డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ సంస్థలపై బ్రాడ్కాస్టర్ అభిప్రాయాలను ఉంచడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అయితే ఈ ట్వీట్ ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరిందని, దీనిపై అసహనంతో పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం.
I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW
— Anil K Antony (@anilkantony) January 25, 2023
2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన ఈ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ‘‘ కాంగ్రెస్లో నా పోస్టులన్నింటికీ రాజీనామా చేశాను’’ అని ట్వీట్ చేశారు. భారతదేశంపై బీబీసీ సుదీర్ఘ కాలంగా పక్షపాతాన్ని చూపుతోందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కేరళ కాంగ్రెస్ ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామనే నిర్ణయంపై అనిల్ విభేదించారు. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగానే స్పందించింది. ఇది వలసవాద మనస్తత్వానికి ప్రతిబింబం అని దుయ్యబట్టింది. కేంద్రం ఈ డాక్యుమెంటరీని బ్లాక్ చేయాలని ఆదేశించింది.