న్యూఇయర్ నైట్ ఢిల్లీలో జరిగిన యాక్సిడెంట్ సంచలనం సృష్టిస్తోంది. దీనిలో మరోమకొత్త ట్విస్ట్ ఈరోజు వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో అంజలి ఒక్కర్తే చనిపోయింది కానీ ఆ సమయంలో ఆమెతో మరో ఆమె కూడా స్కూటీ మీద ఉన్నట్టు సీసీ టీవీ కెమెరాలు గుర్తించాయి. దీనిని పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు.
ఇన్సిడెంట్ జరిగిన టైమ్ లో అంజలితో పాటూ మరో యువతి కూడా ఉందని, ఆమె తన స్నేహితురాలు అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కారు గుద్దినవెంటనే అంజలితో పాటూ మరో యువతికూడా పడిపోయి ఉండొచ్చని, అప్పడు ఆమెకు దెబ్బలు తగిలుంటాయని అంటున్నారు పోలీసులు. ఆ భయంతోనే ఆమె పారిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ యువతి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆమెను విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తున్నాయని సీనియర్ అధికారి తెలిపారు.
ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. నిందితుల నుంచి స్టేట్ మెంట్ కూడా తీసుకున్నారు. కానీ యాక్సిడెంట్ అయిన తీరు, అంజలి నగ్నంగా పడి ఉండడం మాత్రం పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాదు యాక్సిడెంట్ ను చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ చెప్పింది కూడా అనుమానాలకు దారి తీస్తోంది. కారులో ఉన్న వ్యక్తులు అంజలిని ఉద్దేశపూర్వకంగానే లాక్కెళ్ళారని, గంటన్నర పాటూ యూటర్న్ లు తీసుకుంటూ కారు నడిపారని దీపక్ చెబుతున్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన పోలీస్ కంట్రోల్ వ్యాన్ ను ఆపి విషయం చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పారు. ఇన్సిడెంట్ అయిన గంటన్నరలో పోలీసులకు 20 సార్లు అయినా ఫోన్ చేసుంటానని, వాళ్ళు కూడా పట్టించుకోలేదని అన్నారు. కారు యూటర్న్ లు తీసుకోవడం తాను కూడా చూశానని ఓ పుడ్ డెలివరీ బాయ్ కూడా చెప్పాడు.
#WATCH | Kanjhawala death case: CCTV footage of that night shows the presence of another girl with the girl who died after being dragged for a few kilometres by a car that hit her in Sultanpuri area.
(CCTV visuals confirmed by police) pic.twitter.com/nd1NUBQVze
— ANI (@ANI) January 3, 2023
ఇక ఢిల్లీ ఘటన విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఈ యాక్సిడెంట్ డిల్లీని కుదిపేస్తుండడంతో దీని మీద హోం మంత్రిత్వశాఖ తరుఫున విచారణ చేయాలని ఆదేశించారు. ఢిల్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ షాలిని సింగ్ దీనిని లీడ్ చేసి వీలయినంత తొందరగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధితురాలి మీద అత్యాచారం జరిగిందా లేదా, యాక్సిడెంట్ అయితే అంజలి నగ్నంగా ఎందుకు పడి ఉండనే విషయాలు తెలపాలని కోరారు. అయితే శవపరీక్ష జరిగిన తర్వాతనే ఏ విషయాలు ఒక కొలిక్కి వస్తాయని అధికారులు చెబుతున్నారు.