టీ 20ల్లో ధోనీ మరో రికార్డ్ సాధించారు. ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా రికార్డులకెక్కారు. 124 క్యాచ్లు పట్టుకుని శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర ఈ జాబితాలో ఇప్పటిదాకా తొలి స్థానంలో ఉండేవారు. ఢిల్లీతో మ్యాచ్లో క్రిస్టియన్ బౌలింగ్లో మార్లోన్ శ్యామ్యూల్స్ క్యాచ్ పట్టడం ద్వారా ధోని ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
హుక్ చేసేందుకు డేర్డెవిల్స్ బ్యాట్స్మెన్ శ్యామూల్స్ యత్నించగా, అది ధోనీవైపు ఎడ్జ్ తీసుకుంది. ఈ దశలో తనదైన వేగంతో ధోనీ క్యాచ్ అందుకున్న తీరు మరోసారి అతని అత్యుత్తమ వికెట్ కీపింగ్ స్పెషాలిటీని చాటింది.