వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో రిపబ్లిక్ న్యూస్ ఛానల్పై సెటైర్లు వేశారు. కొన్ని రోజుల క్రితం వర్మ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిపై ఓ సినిమా కూడా ప్రకటించాడు. ఇటీవల బాలీవుడ్లో డ్రగ్స్ వివాదం రాజుకుంది. ఈ వివాదంలో ప్రముఖ నటి దీపికా పదుకొనె పేరు కూడా వచ్చింది. రేపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెకు సమన్లు ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో వర్మ రిపబ్లిక్ టీవీపై సెటైర్లు వేశారు.
Since Republic Tv is also rich enough,no surprise if they also hire a chartered plane to follow @deepikapadukone ‘s chartered plane and live report from mid air “ Ab plane left liya hai , ab right liya hai ..kidki me se dikhraha hai ab dinner serve horahi hai” etc
— Ram Gopal Varma (@RGVzoomin) September 24, 2020
‘రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ దగ్గర చాలా డబ్బు ఉంది. దీపికా పదుకొనెను ఫాలో అవ్వడానికి ఓ ఛార్టెడ్ విమానం తీసుకున్న ఆశ్చర్యం లేదు. గాలిలోనే వాళ్ళు లైవ్ రిపోర్ట్ చేస్తారు. ఇప్పుడు విమానం లెఫ్ట్ తీసుకుంది. ఇప్పుడు రైట్ తీసుకుంది. ఇప్పుడే దీపికకు డిన్నర్ ఇస్తున్నట్టు కిటికీ లోంచి కనపడుతోంది.’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిపబ్లిక్ టీవీ అలా చేసినా చేస్తుందని నెటిజన్లు వర్మకి వంత పడుతున్నారు.