చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ! వినురవేమ!
అని అన్నాడు యోగి వేమన ఎప్పుడో. చెప్పులోని రాయి బాధ మనకు అనుభవమే. చెవిలోని జోరిగే పెద్దగా అనుభవంలోకి రాదు. అయితే సింగపూర్ ఓ వ్యక్తికి మాత్రం ఇది నరకయాతనగా మారింది. చెవిలో జోరిగ లాంటి పురుగొకటి తిష్టవేసుకుని కూర్చుని రక్తం పీల్చేస్తోంది. ఈ బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు.
వైద్యులు మైక్రో కెమరాతో పరిశీలించి. .చెవిలోపల ఓ ఎనిమిది కాళ్ల పరాన్నజీవి అతుకుని ఉందని, రోగి రక్తాన్ని పీల్చేస్తూ జీవిస్తోందని తేల్చారు. ఆధునిక టెక్నాలజీతో సర్జరీ చేసి ఆ పురుగును బయటికి లాగారు. రక్తానికి అలవాటుపడిన సదరు పురుగు గట్టిగా గుంజితేనేగాని బయటికి రాలేదు. ఈ లాగుడు వల్ల కాస్త రక్తస్రావం కూడా అయింది.