తెలంగాణలో ఇంటర్ పూర్తయిన విద్యార్ధులు డిగ్రీలో చేరేందుకు ఉద్దేశించిన దోస్త్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. దీని ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 1060 కాలేజీల్లోని బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను మూడు లేదా నాలుగు విడతల్లో చేపట్టనున్నారు.
జులై 1 నుంచి 30 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు చేపడతామని, జులై 6 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించామని అధికారులు వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం.. 1. ఆగస్లు 6న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు 2. ఆగస్టు 7 నుంచి 18 వరకు విద్యార్ధుల సెల్ఫ్ రిపోర్టింగ్ 3. ఆగస్టు 7 నుంచి 21 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్ 4. ఆగస్టు 7 నుంచి 22 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం 5. ఆగస్టు 27న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు 6. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ 7. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం 8. సెప్టెంబర్ 16న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు 9. అక్టోబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం.