కొన్ని సార్లు జంతువులు దారితప్పి జనావాసాల్లోకి వస్తుంటాయి. చిరుతపులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు, పాములు.. ఆహరం కోసం, నీళ్ల కోసం అడవుల నుంచి బయటకు వస్తుంటాయి. తాజాగా ఏనుగుల గుంపు ఒకటి.. అడవి నుంచి రోడ్డు దాటుతున్న సమయంలో.. కొంత మంది ప్రయాణికులు.. వాటికి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించారు. దీంతో అవి బెదిరిపోయి.. ఆ రోడ్డుపై ఆగిఉన్న వాహనదారులకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్గా మారింది.
కర్ణాటకలోని హసనూర్ అటవీ ప్రాంతంలోని అడవి సమీపంలో ఈ భయానక ఘటన జరిగింది. కొన్ని ఏనుగులు అడవి గుండా రోడ్డుమీదకు వచ్చాయి. ఇంతలో ప్రయాణికులు.. వాటికి హారన్ మోగిస్తూ..వాటిని ఇబ్బంది పెట్టారు. దీంతో అవి బెదిరిపోయి.. వెంటనే కారుపైకి దూసుకొచ్చాయి. అద్దాలను తమ తొండంతో ధ్వంసం చేశాయి. గట్టిగా ఘీంకరిస్తూ.. కారుపై తమ ప్రతాపం చూపించాయి. దీంతో భయపడిపోయిన డ్రైవర్ కారు నుంచి బైటకు పరుగులు పెట్టాడు.
ఈ వీడియోను.. సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. గెలుక్కొవడమంటే ఇదే.., పాపం.. వాటి మానన వాటిని డిస్టర్బ్ చేయకుండా పొనిస్తే… ఇలా చేయవు కదా.. అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
Totally unacceptable and barbaric behaviour by some idiotic onlookers.Just because Elephants are gentle,they are being magnanimous to these uncouth minions otherwise it does not take much for these gentle giants to show their power.Video-shared.Believed to be in Hasanur Karnataka pic.twitter.com/ZowMtfrVtJ
— Supriya Sahu IAS (@supriyasahuias) June 27, 2022