రోజు రోజుకు టెక్నాలజీ పెరిగి, కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఆధునిక పద్ధతిలో మానవ మలమూత్రాలను శుద్ధిచేసి, నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్లు వచ్చేశాయి. ఫీకల్ సెప్టెజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎఫ్ఎస్టీపీ) పేరుతో దేశంలో తొలిసారిగా తెలంగాణలోని వరంగల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ను అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కాజీపేటలోని అమ్మవారిపేటలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఆస్కి, వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన బంక బయో కంపెనీ ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసింది.
కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ…‘మానవ వ్యర్థాలను వివిధ దశల్లో శుద్ధిచేసి నీరుగా మార్చుతుంది. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దీని ద్వారా రోజుకు 14వేల లీటర్ల నీటిని ఉత్పత్తి చేయవచ్చు. ఈ నీటని ఉద్యానవనాల్లోని మొక్కల పెంపకానికి, రోడ్లను శుభ్రం చేయడానికి వినియోగిస్తారు’ అని చెప్పారు.
‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మానవ వ్యర్థాలను అధిక వేడిమి వద్ద కాల్చి ఎరువులను తయారు చేస్తున్నాం. వరంగల్ మహా నగరాన్ని ఓడీఎఫ్ 2.0గా తీర్చిదిద్దేందుకు ఈ ప్లాంట్ మరింతదోహదపడుతుంది’ నగర కమిషనర్ గౌతమ్ అన్నారు. ఈ ప్లాంటు గురించి ఆస్కి సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాసాచారి, బంక బయో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నమితలు పూర్తిగా వివరించారు.