మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి దాదాపు 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే 20 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు.
#WATCH: Firefighting operation underway at a mall in Nagpada area in Mumbai where a fire broke out last night.
It has been declared a level-5 fire. #Maharashtra pic.twitter.com/YDpgpRHXcm
— ANI (@ANI) October 23, 2020
అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 300 మంది మాల్లో ఉన్నారు. ఈ ప్రమాదం సమయంలో మాల్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మాల్ పక్కనే ఉన్న 55 అంతస్తుల భవనాన్ని ఖాళీ చేయించి దానిలో ఉన్న 3500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద తీవ్రతను అగ్నిమాపక సిబ్బంది లెవల్ 5 గా నిర్దారించింది.