ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికి జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. ఆయా ప్రభుత్వ శాఖల్లో కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తున్న ఉద్యోగుల సర్వీస్ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురవారం రాత్రి విడుదల చేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ తెలిపింది.
అయితే, మొత్తం 16 శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను పొడిగించింది. ఇందులో పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం, మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో ఆర్ధిక శాఖ వెల్లడించింది.
దీంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ, తమ కుటుంబాలను పోషించుకుంటున్నా వారు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మరోక సంవత్సరం పాటు విధులు నిర్వహించే అవకాశాన్ని కల్గించినందుకు జగన్ సర్కార్కు ధనవ్యాదాలు తెలిపారు.