జేడీయూ మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. 75ఏళ్ల వయస్సుల్లో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ..గురువారం సాయంత్రం ఢిల్లీలోని తన ఇంట్లో పడిపోయారు. వెంటనే ఆయన్ని కుటుంబ సభ్యులు గురుగ్రామ్ లోని ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. ఆ సమయంలో అపస్మారకస్థితిలో ఉండటంతో..శరద్ యాదవ్ ను ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ఎన్నిప్రయత్నాలు చేసిన రక్షించలేకపోయామని వైద్యులు తెలిపారు. రాత్రి 10.19గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
देश की समाजवादी धारा के वरिष्ठ नेता, जेडीयू के पूर्व अध्यक्ष, श्री शरद यादव जी के निधन से दुःखी हूँ।
एक पूर्व केंद्रीय मंत्री व दशकों तक एक उत्कृष्ट सांसद के तौर पर देश सेवा का कार्य कर,उन्होंने समानता की राजनीति को मज़बूत किया।
उनके परिवार एवं समर्थकों को मेरी गहरी संवेदनाएँ।
— Mallikarjun Kharge (@kharge) January 12, 2023
రాజకీయాలే జీవితంగా..:
విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే శరద్ యాదవ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గళం వినిపించారు. జేపీ ఉద్యమంలో చేరిన ఆయన…ఎక్కువకాలం ప్రతిపక్షంలో ఉన్నారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పాటు చేయడంలో శరద్ యాదవ్ కీలకపాత్రను పోషించారు.
అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో శరద్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. 1989లో వీపీ సింగ్ సర్కార్ లోనూ పనిచేశారు. రాజ్యసభలో మూడుసార్లు ఎంపీగా సేవలందించారు. మొత్తం 7సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. బీహార్ లో అధికార జనతా దళ్ యునైటెడ్ స్థాపించిన వారిలో శరద్ యాదవ్ ఒకరు. మహాకూటమి నుంచి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగడంతో శరద్ యాదవ్ బీజేపీతో చేతులు కలిపారు.
2018లో లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని స్థాపించారు. తర్వాత రెండేళ్లకు దాన్ని లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జెడీలో విలీనం చేశారు. దీంతో ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు పునాది పడింది.
శరద్ యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
Pained by the passing away of Shri Sharad Yadav Ji. In his long years in public life, he distinguished himself as MP and Minister. He was greatly inspired by Dr. Lohia’s ideals. I will always cherish our interactions. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 12, 2023
శరద్ యాదవ్ మరణవార్త తనకు దిగ్బ్రాంతి కలిగించిందని తేజస్వీయాదవ్ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తన సంతాపాన్ని ట్వీట్ చేశారు.
సింగపూర్ లో ఉన్న లాలూప్రసాద్ యాదవ్…ఆసుపత్రి బెడ్ పై నుంచే వీడియో సందేశం పంపించారు.
अभी सिंगापुर में रात्रि में के समय शरद भाई के जाने का दुखद समाचार मिला। बहुत बेबस महसूस कर रहा हूँ। आने से पहले मुलाक़ात हुई थी और कितना कुछ हमने सोचा था समाजवादी व सामाजिक न्याय की धारा के संदर्भ में।
शरद भाई…ऐसे अलविदा नही कहना था। भावपूर्ण श्रद्धांजलि! pic.twitter.com/t17VHO24Rg
— Lalu Prasad Yadav (@laluprasadrjd) January 12, 2023