తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈమేరకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వారిలో 182 మంది గ్రూప్-1 మెయిన్కు అర్హత సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మెయిన్కు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఈమేరకు ఆయన తెలిపారు. వరంగల్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 100 మంది చొప్పున, హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 200 మందికి మొత్తం 400 మందికి మెయిన్ పరీక్షకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొంది మెయిన్కు అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా మెయిన్కు అర్హత సాధించిన ఆసక్తి ఉన్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవాలని, అయితే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5వేలు చొప్పున 3 నెలలపాటు ఉపకార వేతనం అందిస్తామని తెలిపారు.
ఇక గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ ఇస్తామని వారం క్రితం కె.అలోక్కుమార్ తెలిపారు. ప్రైవేట్ లో కోచింగ్ తీసుకునే స్థామత లేని అభ్యర్థులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర బిసి ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్.. గ్రూప్ 2 రిక్రూట్మెంట్ పరీక్ష కోసం ద్విభాషలో(ఇంగ్లీష్, తెలుగు) ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుల సమర్పణకు బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ ను సందర్శించాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 040-27077929 లేదా 7780359322 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.