ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం కోసం నా ప్రాణాలు ఇస్తాను” అని అన్నాడు. ఈ వ్యాఖ్య దేశ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. బుధవారం ఢిల్లీలోని తన ఇంటిపై బీజేవైఎం శ్రేణుల దాడి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేజ్రీవాల్ను హత్య చేసేందుకు బీజేవైఎం యత్నించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో ఈ-ఆటోలను కేజ్రీవాల్ ప్రారంభించారు.
कल मेरे घर पर हमला हुआ
देश के लिए मेरी जान भी हाज़िर है। पर मैं important नहीं हूँ। देश important है।
इस तरह की गुंडागर्दी सही नहीं है। क्या ऐसे देश आगे बढ़ेगा? नहीं ना? आइए सब मिलकर देश के लिए काम करें। pic.twitter.com/wLBcb5b1Wj
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 31, 2022
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”కేజ్రీవాల్ ముఖ్యం కాదు. ఈ దేశమే ముఖ్యం. దేశం కోసం నా ప్రాణాలు అర్పిస్తాను. దేశంలోనే అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్న బీజేపీ ఇలా గుండాయిజం చేస్తూ, దాడులకు పాల్పడకూడదు. బీజేపీ అనుసరించే ఈ చర్యల వల్ల దేశ యువతకు తప్పుడు సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్టే” అని కేజ్రీవాల్ మండిపడ్డారు. కలిసి కట్టుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అందరిపైనా ఉందని, 75 ఏళ్లుగా కలహాలతో, కుట్రలతో ఈ దేశాన్ని అంధకారంలో ఉంచేశామని అన్నారు.