బీటెక్/ఎంటెక్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు భారత ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని తెలిపింది. అంతేకాకుండా నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఖాళీల సంఖ్య: 54
ఖాళీల వివరాలు:
1. ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు: 2
2. ప్రాజెక్ట్ లీడర్/సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు: 8
3. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు: 41
4. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 41
విభాగాలు:
సాఫ్ట్వేర్ టెస్టింగ్,
సైబర్ సెక్యూరిటీ,
ఎంబడెడ్ సిస్టమ్,
మెషిన్ లెర్నింగ్,
వీఎల్ఎస్ఐ డిజైన్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి:
అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
అర్హతలు:
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: మార్చి 30, 2022.
వెబ్సైట్: cdac.in