తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న మహిళ ఉద్యోగినులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరిట జీవో జారీ చేసింది.
అంతేకాకుండా టీఎస్ఆర్టీసీ మహిళల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో మహిళల కోసం పీక్ అవర్స్లో నాలుగు ప్రత్యేక ట్రిప్పులను నడపనుంది. ఆ ప్రత్యేక బస్సుల్లో 60 ఏళ్లు పైబడిన మహిళలు మార్చి 8న సంబంధిత ఐడీని చూపించి, ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో మహిళా పారిశ్రామిక వేత్తలు, ఎన్హెచ్జీ లేదా డ్వాక్రా గ్రూప్ల ద్వారా ఉత్పత్తులు సేల్స్ కోసం ఉచిత స్టాల్స్, స్పేసెస్ను మార్చి 31వ తేదీ వరకు ఉచితంగా అందించాలని సంస్థ నిర్ణయించింది.
మహిళలకు ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను కూడా సంస్థ కల్పించనుంది. టీఎస్ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆసక్తి గల మహిళలకు 30 రోజుల పాటు ఉచిత హెవీ మోటర్ వెహికిల్ శిక్షణ అందించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల మహిళలు 31 మార్చి 2022లోపు తమ పేర్లను దగ్గర్లోని డిపోలో నమోదు చేసుకోవచ్చు. శిక్షణ పొందిన మహిళలకు జిల్లా కేంద్రంలోని సంబంధిత శిక్షణ కేంద్రాలలో సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్ఎంవీ లైసెన్స్ కనీస 2 సంవత్సరాలు కలిగి ఉండాలి, కోర్సులో చేరడానికి ముందు ఆర్టీఏ నుంచి లర్నర్ లైసెన్స్ పొంది ఉండాలని పేర్కొంది.