రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య నడుస్తాయని పేర్కొంది. మరి ఆ రైళ్లు ఏంటో? ఏఏ తేదీల్లో ఎక్కడెక్కడికి నడుస్తాయో తెలుసుకుందామా..
1.హైదరాబాద్–తిరుపతి: జులై 25, ఆగస్ట్ 1,8,15,22,29 తేదీల్లో
2.తిరుపతి–హైదరాబాద్: జులై 26, ఆగస్ట్ 2,9,16,23,30 తేదీల్లో
3.కాచిగూడ–నర్సాపూర్: జులై 25, ఆగస్ట్ 1,8,15,22,29 తేదీల్లో
4.నర్సాపూర్- కాచ్చిగూడ: జులై 26, ఆగస్ట్ 2,9,16,23,30 తేదీల్లో
5.తిరుపతి- కాచిగూడ: జులై 27, ఆగస్ట్ 3,10,17,24,31 తేదీల్లో నడుస్తాయని తెలిపారు.
30 Weekly Special Trains between Various Destinations @drmgtl @drmhyb @drmsecunderabad @VijayawadaSCR pic.twitter.com/746bkK3cvB
— South Central Railway (@SCRailwayIndia) July 19, 2022
ఇక, వలన్కన్ని ఫెస్టివల్ సందర్భంగా లోకమాన్య తిలక్–నాగపట్నం మధ్య నాలుగు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆగస్టు 26,28, సెప్టెంబర్ 06,08న ఉంటాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లా చేగూరులో అంతర్జాతీయ ధ్యాన కార్యక్రమం జరగనున్న సందర్భంగా ఈ నెల 21,23 తేదీల్లో చెంగల్పట్టు-కాచిగూడ, యలహంక-కాచిగూడ, ముంబై సీఎస్టీ-భువనేశ్వర్, రాజ్కోట్-సికింద్రాబాద్ రైళ్లు వికారాబాద్లో ఆగుతాయని, 25, 26 తేదీల్లో కాచిగూడ-చెంగల్పట్టు రైలు షాద్నగర్లో ఆగుతుందని సూచించారు. భువనేశ్వర్-ముంబై సీఎస్టీ, సికింద్రాబాద్-రాజ్కోట్ రైళ్లు వికారాబాద్లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే ట్విటర్లో వివరాలను వెల్లడించింది.