ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబ్ క్యాలండర్లో ఇచ్చిన పోస్టులకంటే అదనంగా మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు శుక్రవారం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.
ఈ సందర్భంగా గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డిఎస్పీ, డిఎఫ్ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో పోస్టుల భర్తీకి, ఇక గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, ట్రెజరీ అధికారులు తదితర ఖాళీల భర్తీకి వైఎస్ జగన్ అనుమతి ఇచ్చారు.