చమురు సంస్థలు దేశ ప్రజలకు గుడ్న్యూస్ చెప్పాయి. ఎల్పీజీ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ, నేడు ప్రకటన విడుదల చేశాయి. వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా ₹183.50 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2021కి చేరగా, ముంబైలో రూ. 1,981కి చేరింది.
ఇక, హైదరాబాద్ విషయానికొస్తే.. తాజా తగ్గింపుతో హైదరాబాద్లో ఒక సిలిండర్పై ధర రూ.183.50 తగ్గింది. ఇక, కోల్కతాలో రూ.182, ముంబైలో 190.5, మేర తగ్గాయి. గత నెల 1న కూడా కమర్షియల్ సిలిండర్పై రూ.135 తగ్గిన విషయం తెలిసిందే. ఈ లెక్కన నెల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు రూ. 400 పైచిలుకు తగ్గింది.
మరోపక్క వంట గ్యాస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ప్రతి నెల సిలిండర్ ధరలు పెంచుతున్న కేంద్రం ఎట్టకేలకు ప్రజలకు నేడు ఊరట కలిగించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.198 తగ్గిండంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2219 నుంచి రూ.2021కి పడిపోయింది.