ఇస్తాంబుల్లో బాలయ్య సినిమా షూటింగ్.. సెల్ఫీ తీసిన గోపిచంద్
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ 107వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో అంచనాల పెరుగుతున్నాయి. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం యూనిట్ అంతా టర్కీలోని ఇస్తాంబుల్లో గడుపుతున్నారు.
#NBK107🔥🔥🔥🔥#48GloriousYearsOfNBK. #Godofmasses 🦁 @shrutihaasan @MythriOfficial pic.twitter.com/xyIcaj95dV
— Gopichandh Malineni (@megopichand) August 30, 2022
కాగా బాలయ్య సినీ ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా NBK 107 మూవీ సెట్ నుంచి గోపిచంద్ మలినేని ఓ ఫొటోను షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ, శ్రుతి హాసన్తో కలిసి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బాలయ్య లుక్ చూసి అభిమానులు తెగసంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్రలో ఫ్యాక్షనిస్ట్గా.. మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ లు నిర్మాతలు.