తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం 503 గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తులకు చేసుకున్న అభ్యర్థులకు ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం ప్రకటించారు. కావున అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, పరీక్షకు సన్నద్ధం కావాలని ఆయన కోరారు.
కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ..” గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే పకడ్బందీగా ముందుకెళ్తున్నాం. ఆగస్టులోనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని తొలుత అనుకొన్నాం. కానీ, ఇదే సమయంలో యూపీఎస్సీ, బ్యాంక్, టీఎస్ పోలీస్ తదితర పలు పోటీ పరీక్షలు జరుగనుండటంతో వాటిని కూడా రాసుకొనేలా అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని భావించాం. అందుకే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16న, మెయిన్ పరీక్షను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించాం. ఇది అభ్యర్థులకు గొప్ప అవకాశం. ఈ నిర్ణయంతో ప్రిపరేషన్కు కావాల్సినంత సమయం దొరికినట్టే” అని ఆయన అన్నారు.
మరోపక్క గ్రూప్-1 పోస్టులకు తెలంగాణ వ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. వీరికి ఆగస్టు, లేదా సెప్టెంబర్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ గతంలో ప్రకటించింది. కానీ, ఇదే సమయంలో పలు ఇతర పోటీ పరీక్షలు జరుగనుండటంతో అభ్యర్థుల సౌకర్యార్థం అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.