పాకిస్తాన్ లో ఉగ్రవాదులు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు కూడా భద్రత లేదని తెలుస్తోంది. భారత ఇంటలిజెన్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కు చెందిన కమాండర్ బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలమ్ ను పాకిస్తాన్ లోని రావాల్పిండిలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాకు చెందిన పీర్ 15ఏళ్లుగా పాకిస్తాన్ లో నివసిస్తున్నట్లు శ్రీనగర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
After mysterious murder of third highest ranking commander of Hizbul by unknown people near Rawalpindi, Pakistan has increased security cover of most of the terrorists wanted by India including Syed Salahuddin', the leader of Hizbul Mujahideen.
ISI also launches Investigation!
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 21, 2023
పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, పీర్ అలియాస్ ఇంతియాజ్ ఆలం సోమవారం రావల్పిండిలోని ఒక దుకాణం వెలుపల దుండగులు దగ్గరి నుండి కాల్చి చంపారు. నియంత్రణ రేఖ ద్వారా జమ్మూ కాశ్మీర్కు ఉగ్రవాదులను పంపే కార్యకలాపాల్లో పీర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు పీర్ను యూఏపీఏ కింద గతేడాది అక్టోబర్ 4న కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా, ఇతర తీవ్రవాద సంస్థల కార్యకలాపాలను విస్తరించడానికి మాజీ ఉగ్రవాదులను, ఇతరులను సమీకరించడానికి పీర్ అనేక ఆన్లైన్ ప్రచార సమూహాలతో సంబంధం కలిగి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది.