అమెరికన్ సంస్థ హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ పై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. బీజేపీపై కాంగ్రెస్ నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ విషయంపై కేంద్రహోంమంత్రి అమిత్ షా మొదటిసారిగా స్పందించారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. అదానీ గ్రూప్ విషయంలో బీజేపీ దాచి పెట్టేది ఏమీ లేదన్నారు. మేం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు అమిత్ షా. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని…ఈ విషయంలో వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
#WATCH | There is nothing to hide or be afraid of: Union Home Minister Amit Shah in an interview to ANI on Congress’s allegations that Adani being ‘favoured’ by BJP#AmitShahtoANI pic.twitter.com/WXyEAd0524
— ANI (@ANI) February 14, 2023
హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంట్ రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎవరు రాసిచ్చారో తెలియదన్న అమిత్ షా..మోదీపై బీజేపీ డాక్యుమెంటరీపై కూడా స్పందించారు. అమిత్ షా 2002 నుంచి మోదీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరిగుతుందని ఆరోపించారు. ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఈ వివాదంపై మాట్లాడేందుకు నిరాకరించారు.
అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై కాంగ్రెస్ తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో రాజకీయ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. మోదీని టార్గెట్ చేశాయి. అదానీ గ్రూపులో ఎల్ఐసీ కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడులపై ప్రశ్నలు సంధించారు. అయితే ఆరోపలన్నింటినీ ప్రభుత్వం తోసిపుచ్చింది.