తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారపు సంబరాల వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. ”నేను ఇదే విశ్వవిద్యాలయంలో చదివాను. అప్పుడు చదివిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. నేను చదువుకున్న విద్యా సంస్థకే నేను గెస్ట్గా రావడం ఆనందంగా ఉంది” అని ఆమె అన్నారు.
నేను చదువుకున్న విద్యాసంస్థకే నేను గెస్ట్ వెళ్లడం ఆనందంగా ఉంది. కాలేజ్ ప్రాంగణంలోకి ప్రవేశించగానే.. నేను చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి. తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారపు సంబరాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. pic.twitter.com/MxoltAlBgw
— Roja Selvamani (@RojaSelvamaniRK) March 5, 2022
అంతేకాకుండా కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించగానే తాను చదువుకున్న రోజులు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయని తెలిపారు. ‘నేనూ ఈ కాలేజ్ విద్యార్థినే, ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి’ అంటూ రోజా ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోపక్క ఓ వైపు రాజకీయాలలో, మరోవైపు జబర్థస్త్ వంటి కార్యక్రమాల్లో బీజీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా.. రొటీన్ లైఫ్ నుంచి కొంత విరామం తీసుకున్నారు.