దేశంలో కరోనా మహామ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 8,582 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 4,32,22,017కు చేరింది ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అవగా, 5,24,761 మంది మరణించారు. మరో 44,513 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో మహమ్మారికి నలుగురు బలవగా, 4,435 మంది బాధితులు వైరస్నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో క్రియాశీలక కేసుల వాటా 0.10గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరింది.
దేశంలో రికవరీ రేటు 98.68 శాతానికి పడిపోయింది. నిన్న 3,16,179 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోగా.. ఇప్పటివరకూ 1,95,07,08,541 వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.